Breaking: తిరుమలలో బోనులో చిక్కిన ఐదో చిరుత.. కొనసాగుతున్న ఆపరేషన్
తిరుమల బోనులో మరో చిరుత చిక్కింది. నరశింహస్వామి ఆలయం, 7వ మైలు మధ్య ప్రాంతంలో చిరుతని ట్రాప్ చేశారు అటవిశాఖ అధికారులు. ఐదో చిరుత కూడా మగ చిరుతగానే అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితమే ట్రాప్ కెమెరాలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించింది అటవీశాఖ. చిరుత సంచరిస్తున్న ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి బంధించారు. ఇక నడకమార్గం, ఘట్ రోడ్డులలో ఆపరేషన్ కొనసాగుతోంది.