SHARMILA VS TUMMALA: పాలేరు వార్.. షర్మిల, తుమ్మలలో ఈ సీటు ఎవరికి దక్కనుంది?
తెలంగాణ రాజకీయాల్లో డైనమిక్స్ మారుతున్నాయి. కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పాలేరు టికెట్ కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ కూడా అంగీకరించిందని సమాచారం..మరోవైపు పాలేరు నుంచి పోటి చేస్తానని ఇప్పటికే వైటీపీ అధినేత్రి షర్మిల ప్రకటించగా.. ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ ఐనట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇద్దరిలో ఎవరికి ఈ టికెట్ దక్కుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.