తీరు మార్చుకోని టీడీపీ చింతమనేని..గొర్రెల కాపరిపై దాడి.!
ఏలూరు జిల్లాలో టీడీపీ చింతమనేని ప్రభాకర్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రాపురం లక్ష్మీనారాయణ అనే గొర్రెల కాపరిపై చింతమనేని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆపై దౌర్జన్యంగా గొర్రెలను ఎత్తుకెళ్లాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.