ఈసారి కూడా నాకు అవకాశం కల్పించండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. వైసీపీ నుంచి తాను దూరంగా జరిగి తెలుగు దేశం పార్టీలోకి ఎందుకు చేరాలో స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఇప్పటికే తనపై నమ్మకంతో రెండు సార్లు గెలిపించారని ఇందుకు రుణపడి ఉంటానన్నారు. గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు.