ఏపీలో ఈసారి వైసీపీ కష్టమే.! 40-45 సీట్లే వస్తాయి..ఎంపీ రఘురామ..!!
స్వపక్షంలో విపక్షనేత..ఫైర్ బ్రాండ్..నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సరికొత్త సర్వేను తెరమీదకి తెచ్చారు. ఏపీలోని ప్రస్తుత పరిణామాల దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో ఏయేపార్టీకి ఎన్నిస్థానాలొస్తాయనే అంశాలకు సంబంధించి తాను నిర్వహించిన సర్వేరిపోర్ట్ ను వెల్లడించారు.సదరు సర్వే ప్రకారం తమ పార్టీ(వైసీపీ) ఘోర పరాజయం పొందడం ఖాయమన్నారు.తాను రాష్ట్రంలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలను క్రోడీకరించి వచ్చిన వాస్తవాలను ఆధారంగా వారితో మాట్లాడి చివరగా తాను ఒక అంచనాకు వచ్చానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విధానాల వల్ల ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు పడే అవకాశం ఉందన్నారు. 4 ఎంపీస్థానాలు, 40 -45 అసెంబ్లీ స్థానాలు వస్తాయని. లెక్కలు కుదిరి విపక్ష కూటమి ఏర్పడితే ఆ సంఖ్య 20 -25 స్థానాలకు పడిపోతుందని ఎంపీ రఘురామ కృష్ణ రాజు చెప్పారు.