Megha Bonds Row: సరిగ్గా ఆ ప్రాజెక్ట్ డీల్కు ముందే రూ.140 కోట్ల ఎలక్టోరల్ బాండ్ను కొనుగోలు చేసిన మేఘ!
గతేడాది మహారాష్ట్రలో 14,400 కోట్ల థానే-బోరివాలి జంట సొరంగం ప్రాజెక్ట్ను టెండర్ ద్వారా మేఘా సంస్థ గెలుచుకుంది. దీనికి ఏకైక బిడ్డర్ మేఘ. ఇది జరగడానికి ఒక నెల ముందు మేఘా సంస్థ రూ.140 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ను కొనుగోలు చేసినట్టు ECI డేటా చూపిస్తోంది.