TTD: తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తుల విజ్ఞప్తి..ఈవో ఏమన్నారంటే.!
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి..ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదన్నారు. అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.