PM Modi Dhyan: ముగిసిన ప్రచార పర్వం.. ధ్యానంలో ప్రధాని మోదీ!
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. ఏడు దశల ఈ సుదీర్ఘ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలకు విశ్రాంతి దొరికింది. ప్రధాని మోదీ ప్రచారం ముగించుకుని కన్యాకుమారిలో ప్రసిద్ధ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటల సుదీర్ఘ ధ్యానం ప్రారంభించారు.