జీపీఎస్ విధానంపై క్లారిటీ ఇచ్చిన బుగ్గన
ఏపీలో జీపీఎస్ విధానాన్ని తీసుకురావడంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తే 2050 నాటికి 49 వేల కోట్ల వ్యయం అవుతుందన్నారు. స్థూల ఉత్పత్తిలో పెన్షన్ వ్యయం 107 శాతానికి వెళ్తుందని మత్రి అంచనా వేశారు. ఇది ఒక దశకు వచ్చే సరికి ఆర్థిక వ్యవస్థ మొత్తం స్థంభించి పోయే పరిస్థితి వస్తుందని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు.