Kakinada: గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.... 20 మంది విద్యార్థులకు అస్వస్థత!
ఏలేశ్వరం బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వంటశాల అపరిశుభ్రంగా ఉండటమే ఈ ఫుడ్ పాయిజన్ కి కారణం అయి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.