Vijayawada: ఇంద్రకీలాద్రీ పై గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్న అమ్మవారు!
ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి(Navaratri) ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. మొదటిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. రెండో రోజున అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో అమ్మవారి రూపానికి ఎంతో విశిష్టత ఉంది.