Pakistan team: హైదరాబాద్లో పాకిస్థాన్ టీమ్.. హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు
భారత్లో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు దాయాది పాక్ టీమ్ భారత్ చేరుకుంది. ఇటీవల పాక్ ఆటగాళ్లకు వీసాలు రాకపోవడంతో పాక్ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా దీనిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో చర్చలు జరపడంతో బీసీసీఐ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.