పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నిరసనలు
చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాయలసీమకు మంజూరైన ఎయిమ్స్ వంటి కొన్ని భారీ ప్రాజెక్టులను సైతం అమరావతికి తరలించాడంటూ ధ్వజమెత్తారు. పుంగనూరులో ప్రాజెక్టులు నిలిచిపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణమని ఆరోపించారు. రెండు నీటి ప్రాజెక్టులను పుంగనూరులో ఏర్పాటు చేయకుండా కోర్టు స్టే తెచ్చి నిలిపివేశారని విమర్శించారు. రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టుకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయలేదని..