Nadendla Manohar: నిబద్దత కలిసిన నాయకున్ని అరెస్ట్ చేశారు
నిబద్దత కలిగిన రాజకీయ నేతను అరెస్ట్ చేయడం ఏంటని జనసేన నేత నాదేండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు.
నిబద్దత కలిగిన రాజకీయ నేతను అరెస్ట్ చేయడం ఏంటని జనసేన నేత నాదేండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు.
ఇవాళ ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. వివిధ మార్గా్ల్లో తిప్పుకుంటూ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. కాసేపు సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారించనున్నారు అధికారులు. అనంతరం జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరుస్తారు.
రాజకీయ విలువలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు. చంద్రబాబు తన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సుమారు 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని మంత్రి వేణు ఆరోపించారు.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల నిలిపివేతకు ఏపీ ప్రభుత్వం అప్రకటిత ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కడపలో మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నట్లు సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒక్కరని నాని కొనియాడారు. ఐటీ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని.. దానికి ఆయన వివరణ ఇస్తారని తెలిపారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతున్నారు. పాదయాత్రలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే పనితీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల వ్యాపారంతో చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాధించారన్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని బాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
ఐటీ స్కామ్తో పాటు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలో నాటి సీఎం, నేటి విపక్ష నేత చంద్రబాబుకే ముడుపులు వెళ్లాయని ఆరోపిస్తూ మనోజ్ వాసుదేవ్, ఉమేష్ గుప్తాకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.