నాపైనే హత్యాయత్నం చేసి.. నాపైనే కేసు పెడతారా: చంద్రబాబు ఫైర్
తనపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపైనే హత్యాయత్నం చేసి.. రివర్స్ లో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే అంగళ్లలో విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు ఘటనకు సంబంధించి వైసీపీ అరాచకాలతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పుపట్టారు.