Chandrababu Arrest: చంద్రబాబు కేసులో మరో ట్విస్ట్.. 30 నిమిషాలు టైమ్ ఇచ్చిన ఏసీబీ కోర్టు..
చంద్రబాబు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ పత్తిపాడుకు చెందిన మహేష్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున తాను సంతకం పెడుతున్నట్లు తెలిపాడు మహేష్ రెడ్డి చేతి రాతతో కూడిన ఈ పిటిషన్ కాపీని ఏసీబీ కోర్టులో దాఖలు చేశాడు న్యాయవాది చెన్నకేశవులు.