Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది. ఈనెల 19వ తేదీకి విచారణను వాయిదా వేసిన న్యాయమూర్తి ఆ లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకీ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే.