Case on Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసు అసోసియేషన్ సీరియస్ అయ్యింది. దీంతో ఆయనపై నాగర్ కర్నూల్ పోలీసు స్టేషన్లో పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవర్ధన్ పట్వారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. కాగా, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెట్టుకుంటామని.. కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మిత్తితో సహా కలిపి ఇస్తామన్నారు...