బిల్డప్ వద్దు..టోఫెల్ లో 4500 కోట్ల స్కాం నిరూపించండి..!!
విద్యా వ్యవస్థలో స్కాంలు జరుగుతున్నాయని జనసేన ఆరోపించడంపై మంత్రి బొత్స స్పందించారు. టోఫెల్ విద్యా విధానంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశ్యం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు ఇస్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. టోఫెల్ లో 4500 కోట్లు స్కాం అని నాదెండ్ల మనోహర్ అంటున్నారని..ఇందులో స్కాం ఎక్కడ ఉందో మనోహర్ చూపించాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స.