AP Politics: ఒంగోలు నుంచి నేనే పోటీ చేస్తా.. రేపే అభ్యర్థులు ఫైనల్: బాలినేని కీలక ప్రకటన
సీఎం జగన్ తో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తానని ప్రకటించారు. రేపు వైసీపీ అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఫైనల్ అవుతుందని చెప్పారు.