AP: జీతాల పెంపు సాధ్యం కాదు.. అంగన్వాడీలతో చర్చలు విఫలం
అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జీతాలను పెంచడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పేయడంతో అంగన్వాడీలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సమ్మె విరమించకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి ఉంటుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.