సాగునీటి రంగంలో కాళేశ్వరం, తాగునీటి రంగంలో మిషన్ భగీరథ రెండు స్కీంలు విఫలం అయ్యాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవారికి ప్రత్యేకంగా ప్రచారం అవసరం ఉండదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది కాబట్టి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ ను గెలిపించబోతున్నాయని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో 70 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పై ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం.
SPECIAL INTERVIEW
Chevella EX MLA KS Ratnam: మంత్రులు, ముఖ్యమంత్రులే పార్టీ మారారు..నేను మారితే తప్పేంటి?..కేఎస్ రత్నం ప్రత్యేక ఇంటర్వ్యూ..!!
మంత్రులు, ముఖ్యమంత్రులే పార్టీలు మారారు..నేను పార్టీ మారటంలో తప్పేంటని ప్రశ్నించారు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. తమ కార్యకర్తల ప్రోద్బలంతోనే తాను బీజేపీలోకి చేరినట్లు వెల్లడించారు. బీజేపీమీద తనకు మొదటి నుంచి అభిమానం ఉందన్నారు. కేసీఆర్ తనను కుటుంబసభ్యుడిగా చూసుకున్నారన్న కేఎస్ రత్నం..కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేయనన్నారు. తనను వ్యక్తిగా కేసీఆర్ బాగా చూసుకున్నారు..కానీ ..రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వలేదన్నారు. రాజకీయాలలో ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటాంటున్న కేఎస్ రత్నం ఆర్టీవీకి ఇచ్చిన ఇంట్రెస్టింగ్ ఇంటర్య్వూను పూర్తిగా చూడండి.
ఇది కూడా చదవండి : విక్రమ్ ల్యాండర్ గురించి ఇస్రో కీలక విషయం వెల్లడి…ఏం చెప్పిందంటే..?