జీవితం మారిపోవడానికి ఒక్క క్షణం చాలు.. ఆ ఒక్క క్షణంలో ఆకాశమంతా ఎత్తుకు వెళ్లవచ్చు.. పాతాళానికీ పడిపోవచ్చు.. ఎంతైనా లక్ కూడా ఉండాలి. కొంతమందికి అధృష్టం వైఫై లాగా చుట్టూనే ఉంటుంది.. మరికొందరికి శని నెత్తిపైనే నాట్యమాడుతుంది. కేరళ(Kerala)కు చెందిన 39 ఏళ్ల శ్రీజు(Sreeju) 11 సంవత్సరాలుగా దుబాయ్(Dubai)కు తూర్పున 120 కిలోమీటర్ల దూరంలోని ఫుజైరాలో నివసిస్తున్నాడు. ఓ పరిశ్రమలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. బాగా డబ్బులు సంపాదించి సొంతిల్లు కట్టుకోవాలన్నది అతని డ్రీమ్. ఈ లక్ష్యంతోనే పొట్టకూటికోసం సొంతూరును విడిచిపెట్టి దుబాయ్కు వెళ్లాడు. అక్కడ అతని లైఫే మారిపోయింది.
Also Read: ‘తమ్ముడు.. పక్కకెళ్లి ఆడుకో..మా పరువు తియ్యకు..’ తలకొట్టుకున్న లెజెండరీ ప్లేయర్!
లక్కీ డ్రాలో నక్క తోక తొక్కాడు:
శ్రీజు ఒక రోజు తన పనిలో బిజీగా ఉండగా.. కాల్ వచ్చింది. లక్కీ డ్రా ఆర్గనైజర్స్ నుంచి ఆ కాల్ వచ్చింది. శ్రీజు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అవతలి వాళ్లు చెప్పిన మాట విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తనకు లక్కీ డ్రాలో రూ.45కోట్లు వచ్చిందని ఆర్గనైజర్స్ చెప్పడంతో శ్రీజు నోటి నుంచి మాట రాలేదు. నమ్మలేకపోయాడు. షాక్తోనే కాసేపు అలానే ఉండిపోయాడు. వెంటనే ఈ లోకంలోకి వచ్చిన శ్రీజు ఎగిరిగంతేశాడు. వెంటనే తన ఖాతాలో డబ్బులు కూడా పడ్డాయి. తన కళ్లలను తానే నమ్మలేకపోయానని ఈ లక్కీ డ్రా గెలుపు తర్వాత చెప్పుకొచ్చాడు శ్రీజు.
దుబాయ్లో భారతీయులను వరించిన లక్కీ డ్రాలు:
అటు గతంలోనూ చాలా మంది భారతీయులు యూఏఈ డ్రాల్లో పెద్ద విజయాలు సాధించారు. గత శనివారం కూడా కేరళకు చెందిన శరత్ శివదాసస్కు ఎమిరేట్స్ డ్రాలో సుమారు రూ.11 లక్షలు వచ్చాయి. ముంబైకి చెందిన మనోజ్ భావ్సర్కు కూడా ఇదే డ్రాలో విజేతగా నిలిచాడు. అబుదాబిలో 16 ఏళ్లుగా ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్గా పనిచేస్తున్న భావ్సర్కు డ్రాలో సుమారు రూ. 16 లక్షలు వచ్చాయి. తన అప్పులు తీరిపోయాయని అతను ఎంతో ఆనందపడ్డాడు. గత నెలలో అబుదాబి, దుబాయ్లోని భారతీయుల్లో పలువురికి ఇలానే అధృష్టం వరించింది. వారంతా రూ. 10 లక్షల లాటరీలను గెలుచుకున్నట్లు వార్తలు వచ్చాయి. యూఏఈలో లాటరీ టిక్కెట్లను ఎక్కువగా కొనుగోలు చేసేవారు భారతీయులేనని నివేదికలు చెబుతున్నాయి.
Also Read: కంపు ఉండదు.. పొలూష్యన్ ఉండదు.. కారులో గాల్లోనే ఎగిరిపోవచ్చు..!
WATCH: