Crime News: అనకాపల్లి జిల్లాలో దారుణం..అత్తను చంపిన అల్లుడు..!

అనకాపల్లి జిల్లా అడ్డూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను కాపురానికి పంపడం లేదని అత్త మామపై అల్లుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో అత్త అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాల పాలైన మామను చికిత్స నిమిత్తం విశాఖకు తరలించారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Vishaka: భార్యను కాపురానికి పంపడం లేదని కోపం పెంచుకున్న అల్లుడు తన అత్తమామపై కత్తి దాడికి దిగాడు. ఈ దాడిలో అత్త అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకరమైన ఘటన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అడ్డూరు గ్రామానికి చెందిన భర్త మామిడి పైనాయుడు అనే వ్యక్తిపై భార్య విసుగెత్తి పుట్టింటికి వెళ్లింది. అయితే, తన అత్త మామ తన భార్యను కాపురానికి పంపకపోవడంతో భర్త తీవ్ర మనస్థాపం చెందాడు. తన భార్య తనతో కాపురానికి రాకపోవడానికి తన అత్తయ్య ప్రధాన కారణమని భావించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనై నిన్న రాత్రి అత్త సానబోయిన లక్ష్మిపై కత్తితో దాడి చేసాడు.

అడ్డు వచ్చిన మామపై కూడా దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో అత్త సానబోయిన లక్ష్మి అక్కడికక్కడే మరణించింది. తీవ్ర గాయాల పాలైన అతని మామను విశాఖపట్నం కెజిహెచ్ తరలించారు.విషయం తెలుసుకున్న చోడవరం పోలీసులు ముద్దాయి మామిడి పైడినాయుడిని అదుపు లోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : కాంగ్రెస్‌‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే

Advertisment
తాజా కథనాలు