ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రాజీనామా చేసి వైసీపీ కోసం ప్రచారం చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని వారు తలలు పట్టుకుంటున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారిలో చాలా మంది టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పలువురు వాలంటీర్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబును కలిశారు. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్యేకు తెలిపారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
వైసీపీ నేతల ఒత్తిడి మేరకే రాజీనామా చేశామని వారు చెప్పారు. ఇక నెల్లూరులో వాలంటీర్లు ఏకంగా వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ గౌరి, సురేష్రెడ్డి ఒత్తిడితోనే తాము రాజీనామా చేశామని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఇలా రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తిగా మారింది. ఎన్నికల ముందు వైసీపీ కోసమని చెప్పి రాజీనామా చేసిన వాలంటీర్లు దాదాపు లక్ష మందికి పైగా ఉన్నారని సమాచారం.