భారత్ లో SUVకార్ల కేటగిరీలో మహీంద్రా థార్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటికే భారత్ మార్కెట్లో పలు మోడళ్ల విక్రయాలతో టాప్ లో కొనసాగుతోంది. ఫ్యామిలీ అవసరాలకే కాదు..వాణిజ్య పరంగానూ మహీంద్ర వినియోగాదారులకు సేవలందిస్తోంది. ఈ టాప్ కంపెనీ నుంచి కొత్త మోడల్ లాంచ్ అవుతుందంటే..ఔత్సాహికుల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మహీంద్ర వరుసగా నాలుగోసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న కొత్త కారును విడుదల చేస్తోంది. ఈసారి వారు థార్ 5-డోర్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
పూర్తిగా చదవండి..ఈ కారు ధరతో ఓ బడ్జెట్ ఫిల్మ్ తియ్యోచ్చు.. లాంచ్ ఎప్పుడంటే..!!
మహీంద్రా థార్...ఈ కారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాంచ్ చేసిన కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున యూనిట్ల థార్ కార్లు అమ్ముడయ్యాయి. మహీంద్రా 2020 నుంచి ప్రతిఏటా కార్లను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే 3 డోర్ తో వచ్చిన థార్ కారు మంచి సక్సెస్ రేటును అందుకుంది. వరుసగా నాలుగోసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న కొత్త కారును విడుదల చేస్తోంది. ఈసారి వారు థార్ 5-డోర్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి ముందు థార్, XUV700, కొన్ని ఈవీలను ప్రవేశపెట్టింది.
Translate this News: