Shyamala Devi: ప్రభాస్ అభిమానులు ఈ పార్టీ వైపే ఉన్నారు.. అందుకోసమే రంగంలోకి దిగాను..!

ప్రభాస్ అభిమానులు బీజేపీవైపే ఉన్నారన్నారు మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు భార్య శ్యామల దేవి. నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ 70 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. శ్రీనివాసవర్మ గెలుపులో తన కుటుంబం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Shyamala Devi: ప్రభాస్ అభిమానులు ఈ పార్టీ వైపే ఉన్నారు.. అందుకోసమే రంగంలోకి దిగాను..!
New Update

BJP Shyamala Devi : మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు భార్య శ్యామల దేవి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ గెలుపు కోసం తాను రంగంలోకి దిగానట్లు తెలిపారు. టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు అభిమానులు, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు బీజేపీవైపే వున్నారని పేర్కొన్నారు.

Also Read: నందిగామలో టీడీపీ భారీ ర్యాలీ.. మద్దతుగా హిరో శివాజీ ఎన్నికల ప్రచారం..!

కృష్ణంరాజు శిష్యుడు శ్రీనివాసవర్మలో కృషంరాజును చూసుకుంటున్నామని.. శ్రీనివాసవర్మ గెలుపులో తన కుటుంబం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 70 వేలకు పైగా మెజారిటీతో శ్రీనివాసవర్మ గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ  కింది వీడియో చూడండి..

#shyamala-devi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe