Indravelli Incident: హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనం అయినప్పుడు ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కిందకు వచ్చాయి. ఇది గిరిజనుల భూములను ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడింది. 1959లో భూమి బదలాయింపు చట్టం తీసుకువచ్చారు. 1970లో ఈ చట్టానికి మార్పులు చేశారు. అయితే చట్టాలు ఎంత పకడ్బందీగా ఉన్నా అమలు చేయడంలో నిర్లక్ష్యం జరిగింది. 70వ దశకంలో ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణలోని గిరిజన ప్రాంతానికి వ్యాపారాల నిమిత్తం వచ్చిన వారు ఎక్కువయ్యారు. ఈ వ్యాపారులు అక్కడే స్థిర పడిపోయారు. స్థానిక గిరిజనుల చేతుల్లో ఉండాల్సిన భూమి,అటవి సంపద చేతులు మారాయి. గిరిజనుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఈ వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం ఇంద్రవెల్లిలో సరిగ్గా నాడు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Indravelli Incident: చరిత్రలో చెరగని రక్తపు మరక ఇంద్రవెల్లి @ 43.. అసలు ఆ రోజు ఏం జరిగింది?
నెత్తుటి మరకలు ఆరని ప్రాంతమది.. చరిత్రలో చెరగని రక్తపు మరక.. ఇంద్రవెల్లి మారణకాండ..! ఘటన జరిగి 43ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ నాటి పీడకలలను అక్కడి గిరిజనులు తలుచుకోని రోజే ఉండదు. అసలు ఆ నాడు ఏం జరిగింది? తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: