Rangareddy: డీఎస్పీ భార్య ఆవేదన.. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని..
రంగారెడ్ది జిల్లా తుర్కయంజాల్ లో తన భర్త కోసం భార్య రోడ్డెక్కింది. డీఎస్పీగా పనిచేస్తున్న రంగా నాయక్ విడాకులు ఇవ్వాలని తనను వేధిస్తున్నాడని భార్య జ్యోతి అతని ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Rangareddy: రంగారెడ్ది జిల్లా తుర్కయంజాల్ లో తన భర్త కోసం భార్య రోడ్డెక్కింది. భర్త మెదక్ ఏ ఆర్ డీఎస్పీ రంగా నాయక్ తనకు విడాకుల ఇవ్వాలని వేధిస్తున్నాడని భార్య జ్యోతి అతని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదనీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2007 రంగనాయకు తనకు పెళ్లైందని తర్వాత ఇద్దరు అడపడుచులకు పెళ్ళీలు కూడ చేశామని తెలిపింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది.
2018లో తుర్కయంజాల్ కు వచ్చి నివాసం ఉంటున్నామని వెల్లడించింది. 2021 నుండి ఇద్దరి మద్య గొడవలు మొదలయ్యాయని.. 6 నెలల నుండి విడాకులు కావాలని తన భర్త వేధిస్తున్నాడని జ్యోతి వాపోతోంది. తనకు న్యాయం జరగాలంటూ రంగనాయక్ ఇంట్లో ఉన్న సమయంలో జ్యోతి బందువులతో కలిసి నిరసనకు చేపట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగా నాయక్ ను స్టేషన్ కు తరలించారు.