Summer Special Trains : వేసవి కాలం ప్రత్యేక రైళ్లు.. రెండు నెలల పాటు 1079 ట్రిప్పులు!

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్‌ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 1079 ప్రత్యేక ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం

Indian Railways : వేసవి కాలాన్ని(Summer Season) దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్‌ రైల్వే(South Central Railway) అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 1079 ప్రత్యేక ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్‌ రైల్వే ఆధ్వర్యంలోనూ దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా 9,111 ట్రిప్పు లు నడుపుతున్నామని అధికారుఉల పేర్కొన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి(Financial Year 2023-24) గాను రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నెట్‌వర్క్‌ రికార్డు సృష్టించినట్లు అధికారులు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 649 కిలోమీటర్ల మేర ట్రాక్‌ పునరుద్ధరణ చేశామని, ఈ సారి 45 శాతం అధికంగా పూర్తి చేసినట్లు తెలిపారు.

ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి జూన్‌ 15 వరకు ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మైసూర్‌-ముజఫర్‌పూర్‌, బెంగళూరు-మాల్దాటౌన్‌, బెంగళూరు-బీదర్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు(Special Trains) రాకపోకలు కొనసాగిస్తాయన్నారు.

Also read:  నేడు వైఎస్‌ షర్మిల నామినేషన్‌ ..ఇడుపుల పాయ లో ప్రత్యేక ప్రార్థనలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు