Varadarajulu Reddy: ఎమ్మెల్యే రాచమల్లు నీచనికృష్టుడు.. చివరికి తల్లిని సైతం..

ఎమ్మెల్యే రాచమల్లు అంత నీచనికృష్టుడు రాజకీయాల్లో లేడన్నారు ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి. మున్సిపాలిటీలో వందల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. లక్షల్లో ఉన్న రాచమల్లు ఆదాయం వందల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు.

New Update
Varadarajulu Reddy: ఎమ్మెల్యే రాచమల్లు నీచనికృష్టుడు.. చివరికి తల్లిని సైతం..

TDP MLA Candidate Varadarajulu Reddy: కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  లక్షల్లో ఉన్న ఎమ్మెల్యే రాచమల్లు ఆదాయం వందల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ఆ మర్మమేంటో ప్రజలకు చెబితే వాళ్ళు సంపాదనపరులు అవుతారు కదా అన్నారు.  అదంతా అవినీతి అక్రమంగా అడ్డదారిలో సంపాదించిన సొమ్మె అని అర్థమయిందన్నారు.

Also Read: ప్రభాస్ అభిమానులు ఈ పార్టీ వైపే ఉన్నారు.. అందుకోసమే రంగంలోకి దిగాను..!

మార్కెట్ నిర్మాణంలోనూ మరొకరికి టెండర్ దక్కకుండా అడ్డుకొన్నారని అందులోనే 10కోట్లు మేర దోచేసాడని ఆరోపించారు. ప్రొద్దుటూరు ఎక్కడ అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. ప్రమాణం చేయడానికి భారతదేశంలో ఉన్న దేవుళ్లంతా అయిపోయారని..చివరికి తల్లిని సైతం అవమానపరిచడానికి వెనుకాడారని దుయ్యబట్టారు.

Also Read: ఏపీలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఎక్కడంటే

రాచమల్లు అంత నీచనికృష్టుడు రాజకీయాల్లో లేడని ధ్వజమెత్తారు. మరొకరిని ఎదగనివ్వడు.. ఎదగాలని ప్రయత్నం చేస్తే వాళ్ళను అనేక రకాలుగా హింసిస్తాడని ఫైర్ అయ్యారు. అవినీతికి విచ్చలవిడిగా గేట్లు ఎత్తేశాడని అయన బామ్మర్ది షాడో ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీలో వందల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు