హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం!

సంగారెడ్డి హైవే పై గురువారం అర్థరాత్రి ఓ ప్రైవేట్‌ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను పసిగట్టిన డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

New Update
హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం!

సంగారెడ్డి జిల్లాలో గురువారం అర్థరాత్రి సమయంలో హైదరాబాద్‌ నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరిని అప్రమత్తం చేయడంతో వారంతా బస్సు నుంచి కిందకి దిగి పోయి తమ ప్రాణాలను రక్షించుకున్నారు.

బస్సు ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు మాత్రమే కిందకి దిగడం వల్ల ప్రయాణికులందరి వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో షార్ట్ సర్క్యూట్‌ వల్ల జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రయాణికులందరినీ వేరే బస్సుల్లో తమ గమ్య స్థానాలకు పంపించారు.

ఈ ప్రమాదం నుంచి కాపాడిన డ్రైవర్‌ ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయన ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే పరిస్థితి వేరే విధంగా ఉండేదని స్థానికులు అంటున్నారు. ప్రయాణికులు కిందకి దిగి ఉండక పోతే పదులు సంఖ్యలో ప్రాణాలు మంటల్లో బూడిద అయి ఉండేవని తెలుస్తుంది.

పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: చరణ్‌ తో కలిసి నటించాలనుకుంటున్నారా..అయితే ఈ అవకాశం మీ కోసమే!

Advertisment
తాజా కథనాలు