Ponguleti: పొంగులేటి నిండా ముంచాడు.. టికెట్ మనదేనంటూ మోసం చేశాడు: ఆడియో వైరల్

సత్తుపల్లి టికెట్ తమకు ఇప్పిస్తానని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమను మోసం చేశాడని కొండూరు సుధాకర్ సతీమణి రత్నకుమారి ఆరోపించారు. చివరి నిమిషంలో కూడా టికెట్ మనదేనంటూ నమ్మించాడని ధ్వజమెత్తారు. ఆమె ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Ponguleti: పొంగులేటి నిండా ముంచాడు.. టికెట్ మనదేనంటూ మోసం చేశాడు: ఆడియో వైరల్
New Update

కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి  (Ponguleti Srinivas Reddy) ఆయన ప్రధాన అనుచరుడు కొండూరు సుధాకర్ (Konduru Sudhakar) షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ (BRS) లో చేరారు. జులై 2న రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి వెంట కాంగ్రెస్ లో చేరారు సుధాకర్. శ్రీనివాసరెడ్డి ఆశిస్సులతో సత్తుపల్లి టికెట్ ఆశించిన సుధాకర్.. దక్కకపోవడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ రాగమయికి కేటాయించడంతో కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి రాగమయికి పొంగులేటి మద్దతు తెలపడంతో మరింత మనస్తాపానికి గురయ్యారని చర్చ సాగుతోంది. అయితే.. సుధాకర్ బీఆర్ఎస్ కు అమ్ముడుపోయాడంటూ సోషల్ మీడియాలో కొందరు కాంగ్రెస్ నేతలు పోస్టులు పెడుతున్నారు. ఈ కామెంట్స్ కు సుధాకర్ సతీమణి రత్నకుమారి తాజాగా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

ఇది కూడా చదవండి: BREAKING: హస్తం గూటికి విజయశాంతి.. కాంగ్రెస్ కీలక నేత సంచలన ప్రకటన

పొంగులేటి తమను నిండా ముంచాడని ఆవేదన వ్యక్తం చేశారు. దయానంద్ చాప్టర్ క్లోజ్ అయిందన్నాకే తాము పార్టీలో చేరామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి లక్షల రూపాయలు ఖర్చు చేసి తిరిగామన్నారు. చెల్లెమ్మా నేనున్నా టికెట్ మనదేనని చెప్పి పొంగులేటి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో కూడా టికెట్ మనదేనని నమ్మించారన్నారు. టికెట్ మాకొస్తే మేం పనిచేయమని మట్టా దయానంద్ చెప్పారన్నారు. ఆరోజు దయానంద్ ను ఎవరూ ప్రశ్నించలేదన్నారు.

ఈరోజు తాము పార్టీ మారితే అమ్ముడు పోయామనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మట్టా దయానంద్ రాగమయి ఎలా గెలుస్తారో మేమూ చూస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో రెండు ఎస్సీ స్థానాలు మాలలకే ఇచ్చి మాదిగలకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. దయానంద్ పై ప్రేముంటే మమ్మల్ని ఎందుకు పిలిపించారంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రత్నకుమారి. దీంతో సామాజిక మాధ్యమాల్లో కొండూరు రత్నకుమారి ఆడియో వైరల్ గా మారింది.

#telangana-elections-2023 #ponguleti-srinivasa-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe