నేడు శ్రీలంక తో భారత్ టీ20 ఫస్ట్ మ్యాచ్ !

శ్రీలంకతో భారత్ టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. సాయంత్రం 7 గంటలకు పల్లెకెలె వేదిక మ్యాచ్ జరగనుంది.అయితే ఈ మ్యాచ్ లో కొత్త భారత్ కోచ్ గా పగ్గాలు చేపట్టిన గంభీర్ వైపే అందరీ దృష్టి నెలకొంది.మరోవైపు టీమిండియా యువబ్యాటర్లు,బౌలర్ల తో బలంగా కనిపిస్తుంది.

New Update
నేడు శ్రీలంక తో భారత్ టీ20 ఫస్ట్ మ్యాచ్ !

శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు నేటి నుంచి శ్రీలంకతో జరిగే మూడు టీ20ల సిరీస్‌లో పాల్గొననుంది. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 పల్లెకెలె స్టేడియంలో జరగనుంది. ఈ తొలి టీ20 మ్యాచ్ జరిగే పల్లెకెలె మైదానం పిచ్‌కు సంబంధించిన సమాచారం విడుదలైంది. సాధారణంగా పల్లెకెలెలో బ్యాటింగ్ పిచ్ మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. కొన్నిసార్లు పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట విద్యుత్ దీపాల వెలుగులో పిచ్ కొన్ని ఓవర్ల పాటు మెరుగ్గా స్వింగ్ అవుతుందని పిచ్ నిర్వహణ సిబ్బంది చెబుతున్నారు.

కాబట్టి, మ్యాచ్‌లో మొదటి రెండు-మూడు ఓవర్లకు బంతి బాగా స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు మొదటి మూడు ఓవర్లు జాగ్రత్తగా ఆడాలి. ఈ విధంగా టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. అయితే, ఈ పిచ్ తరచుగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసే జట్టు మొదటి మూడు ఓవర్లు దాటితే, వారు సులభంగా పరుగులు సాధించగలరు. అయితే భారత ఓపెనర్లు శుభ మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఏం చేస్తారు? అనే అంచనా ఉంది.వికెట్ నష్టపోకుండా బౌలింగ్ చేస్తే భారత జట్టు సులభంగా పరుగులు కూడబెట్టగలదు. ఈ మైదానంలో 180 నుంచి 200 పరుగులే అత్యుత్తమ స్కోరుగా ఉన్నాయి.

ఇక శ్రీలంక జట్టు విషయానికొస్తే.. కొత్త కెప్టెన్  అసలంగా సారథ్యంలో  జట్టు ఆడబోతోంది. గత టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు చాలా పేలవ ప్రదర్శన చేసింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఆ జట్టు యావరేజ్‌గా రాణిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. అదే సమయంలో సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు. గత నెలలో జింబాబ్వేలో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టు జాగ్రత్తగా ఆడకపోవడంతో తొలి మ్యాచ్‌లో విఫలమవడం గమనార్హం.!

Advertisment
తాజా కథనాలు