MLA Nallari Kishore Kumar Reddy: వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్లే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్లే చింతల రామచంద్రా రెడ్డి, వారి అనుచరులు చేసిన భూ ఆక్రమణలు, అక్రమ ఇసుక, మట్టి తరలింపు, అక్రమ రిజిస్ట్రేషన్ లు, వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
Also Read: టీడీపీ నాయకుడి దారుణ హత్య.. ఎస్ఐ, సీఐలపై వేటు..!
ఈ నెల12న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత పీలేరు నియోజకవర్గ పరిధిలో జరిగిన అక్రమ అక్రమాలను వెలికితీసి అందరిపై గట్టిచర్యలు తీసుకొంటామని వెల్లడించారు.