Payyavula Keshav: సెంటిమెంట్ బ్రేక్ చేసిన పయ్యావుల.. మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు..!

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు ఆశించిన దానికన్నా ఎక్కువగా కృషి చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్. తమ అధినేత చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా బాధ్యతతో నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు.

New Update
Payyavula Keshav: సెంటిమెంట్ బ్రేక్ చేసిన పయ్యావుల.. మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు..!

Payyavula Keshav: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్  రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశించిన దానికన్నా ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. తమ అధినేత చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా బాధ్యతతో నిర్వహిస్తామని.. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు.

Also Read: వైసీపీ పాలనలో రాష్టం సర్వ నాశనం.. మీరైనా ఇలా చేయకండి.. షర్మిల సంచలన లేఖ..!

కాగా, 30 ఏళ్ల రాజకీయ జీవితం, 4 సార్లు ఎమ్మెల్యే.. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన సమర్థత ఉన్నప్పటికీ టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ మాత్రం ఇంతవరకు మంత్రి కాలేకపోయారు. ఆయన గెలిస్తే కచ్చితంగా టీడీపీ ఓడిపోతుందని.. ఆయన ఓడిపోతే టీడీపీ గెలుస్తుందనే సెంటిమెంట్ జనాల్లో బాగా పాతుకుపోయింది. అయితే, ఈ ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ ని పయ్యావుల కేశవ్ బ్రేక్ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.

#payyavula-keshav
Advertisment
తాజా కథనాలు