EY Pune: పని ఒత్తిడితో పూణేలో ఉద్యోగి మృతి.. రంగంలోకి కార్మిక శాఖ!

కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరైల్ అనే యువతి ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా మరణించిందని ఆమె తల్లి అగస్టిన్ కంపెనీ పని సంసృతిని ఖండిస్తూ లేఖ రాశారు. తాజాగా దీనిపై కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. పెరైల్ మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపింది.

EY Pune

EY Pune

New Update

EY Pune: ఇటీవలే కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరైల్ 26ఏళ్ళ ఆఫీస్ లో అధిక పనిభారం వల్ల ఒత్తిడితో మరణించిన ఘటన అందరి మనసుల్ని కలచివేసింది. కూతురు మరణంతో ఆమె తల్లి అనితా అగస్టిన్ కంపెనీ పని సంస్కృతి, మానవీయ విలువల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ అధిక పని భారాన్ని ప్రోత్సహించడాన్ని ఖండిస్తూ యాజమాన్యానికి లేఖను రాశారు. తన కూతురు మరణం “మేల్కొలుపు కాల్”గా కావాలని. ఇప్పటికైనా కంపెనీలో పని చేసే ఉద్యోగులు, వారి వారి బాగోగులకు ప్రాధాన్యత ఇవ్వడానికి అర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని వాపోయారు. అన్నా సెబాస్టియన్  EY పూణే (Ernst & Young Global Limited) కంపెనీలో చార్టెడ్ అకౌంట్స్  ఎగ్జిక్యూటివ్‌గా పని చేసింది. 

పెరైల్ మరణం పై స్పందించిన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ

అయితే తాజాగా ఈ ఘటన పై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పందించింది. కంపెనీ పని సంసృతి గురించి ఆ తల్లి చేసిన ఫిర్యాదును అధికారికంగా స్వీకరించింది. పెరైల్ మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తమ ట్వీట్ లో ఇలా పేర్కొంది.. ''అన్నా సెబాస్టియన్ పెరాయిల్ విషాదకరమైన నష్టానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. అసురక్షిత, అధిక శ్రమ దోపిడీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. న్యాయం జరిగేలా చూస్తామని తెలిపింది''.

 

తల్లి లేఖ 

ఆమె తన లేఖలో కంపెనీ అధిక పనిని ప్రోత్సహించడాన్ని ఖండించారు. సంస్థ మానవీయ విలువలు తన కుమార్తె అనుభవించిన వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఎలా ఉన్నాయో హైలైట్ ఉన్నాయో హైలైట్ చేశారు.

తన కూతురు పెరైల్ 2023లో CA పరీక్షలను క్లియర్ చేసి, మార్చి 2024లో EY పూణే (Ernst & Young Global Limited) కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా చేరిందని. అది తన మొదటి ఉద్యోగం కావడంతో.. ఆమె అంచనాలకు అనుగుణంగా చాలా కష్టపడి పనిచేయాలనుకునేదాని. కానీ ఆ ప్రయత్నమే ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై భారీ నష్టాన్ని కలిగించిందని వాపోయింది. పెరైల్ ఉద్యోగంలో చేరిన వెంటనే ఆందోళన, నిద్రలేమి మరియు ఒత్తిడిని అనుభవించడం ప్రారంభించింది. కానీ ఆమె కృషి, పట్టుదలే విజయానికి మార్గమని తనను తాను ముందుకు నెట్టుకోవడం కొనసాగించిందని తెలిపింది. కంపెనీలో మితిమీరిన పనిభారం కారణంగా చాలా ఉద్యోగులు రాజీనామా చేశారని. యాజమాన్యం గురించి అందరు తమ అభిప్రాయాలను మార్చుకోమని పెరైల్ తల్లి అగస్టిన్ పేర్కొన్నారు.

పెరైల్ మేనేజర్ ఏదైనా క్రికెట్ మ్యాచులు ఉన్నప్పుడు తరచుగా మీటింగ్స్ ను రీషెడ్యూల్ చేసి.. తీరా రోజు చివరిలో ఆమెకు పనిని కేటాయించేవాడు. దాంతో తన కూతురికి వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యేదని తెలిపింది. ఆఫీస్ అనే ఒక పార్టీలో ఒక సీనియర్ నాయకుడి కింద పని చేయడం కష్టం.. దురదృష్టవశాత్తు, ఆమె తప్పించుకోలేకపోయిందని అని అగస్టీన్ చమత్కరించారు.

తన కుమార్తె అర్థరాత్రి వరకు, వారాంతాల్లో కూడా పనిచేసేదని కూడా ఆమె పేర్కొంది. తాను చేయాల్సిన పని కంటే ఎక్కువ పనిభారం తనపై వేసేవారని. అలాంటి పనులు చేయవద్దని నేను కూడా చాలా సార్లు చెప్పాను. కానీ నిర్వాహకులు ఆమె ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా, వారాంతాల్లో కూడా అర్థరాత్రి వరకు పనిచేసేలా చేసేవారు. ఒక్క రోజు గడువుతో డెడ్ లైన్స్ ఇచ్చేవారు. దాంతో ఆమె పై ఒత్తిడి పెరిగేది . కొన్ని సార్లు ఆమె బట్టలు కూడా మార్చుకోకుండా అలానే బెడ్ పై పడుకుండి పోయేదని తెలిపింది. దుఃఖంలో ఉన్న ఆ తల్లి తన కుమార్తె మరణం కంపెనీకి “మేల్కొలుపు కాల్”గా ఉపయోగపడుతుందని చెప్పింది

ఇప్పుడు సంస్థలోని పని సంస్కృతిని ప్రతిబింబించే సమయం వచ్చింది. ఇప్పటికైనా ఉద్యోగుల ఆరోగ్యం, వారి బాగోగులకు ప్రాధాన్యత ఇవ్వడానికి అర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని కోరింది. తన కూతురు మరణానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. చనిపోయే వారాల ముందు పెరాయిల్.. చాతిలో నొప్పని ఫిర్యాదు చేసినట్లు అగస్టిన్ లేఖలో రాశారు.

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe