AP: నందిగామలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కౌన్సిలర్..!

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో వైసీపీ కౌన్సిలర్ తానూరి రాము టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ల బలం 12కు పెరిగింది. త్వరలో నందిగామ మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకోబోతున్నామన్నారు ఎమ్మెల్యే సౌమ్య.

New Update
AP: నందిగామలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కౌన్సిలర్..!

Nandigama: ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉంది. ఆ పార్టీ శ్రేణులు సైతం అసహనం వ్యక్తం చేస్తూ వేరు గూటికి చేరుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తాజాగా, మరో కౌన్సిలర్ వైసీపీని వీడి టీడీపీ చేరారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ల బలం 12కు పెరిగింది.

Also Read: వయనాడ్ నుంచి RTV లైవ్.. వరద విలయంపై EXCLUSIVE..

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో వైసీపీ కౌన్సిలర్ తానూరి రాము టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో నందిగామ మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకోబోతున్నామన్నారు. ఛైర్మన్ వరలక్ష్మి, వైస్ చైర్మన్ అనారోగ్యం కారణంగా అకాల మరణం చెందడంతో 11,7 వార్డుల ఎన్నికలు అనివార్యం అయ్యాయి. కౌన్సిల్లో వైసీపీ బలం 5కు పడిపోయింది.

Advertisment
తాజా కథనాలు