Nagababu: మెగా ఫ్యామిలీలో చిచ్చు.. అల్లు అర్మీ దెబ్బ .. ట్విట్టర్ డియాక్టివేట్ చేసిన నాగబాబు..!

అల్లు అర్మీ దెబ్బకు మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ నుంచి డీ యాక్టివేట్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నాగబాబు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Nagababu: మెగా ఫ్యామిలీలో చిచ్చు.. అల్లు అర్మీ దెబ్బ .. ట్విట్టర్ డియాక్టివేట్ చేసిన నాగబాబు..!
New Update

Nagababu: ఏపీ ఎన్నికలు మొత్తానికి మెగా ఫ్యామిలీలో సైతం చిచ్చు రేపాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీలోని అందరూ మద్దతుగా నిలిస్తూ పిఠాపురంలో ప్రచారం చేస్తుంటే.. స్టార్ హీరో అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పకు మద్దతు తెలిపారు. దీంతో మెగా అభిమానులతో పాటు టీడీపీ, జనసైనికులు అందరూ అల్లు అర్జున్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read: ఎన్టీఆర్ ను మోసం చేసిన మహిళ.. హైకోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో..!

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ ట్విట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే అంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: ఏపీ ఆందోళన పరిస్థితులపై ఈసీ సంచలన నిర్ణయం.. అప్పటి వరకు కేంద్రబలగాలు రాష్ట్రంలోనే..

దీంతో అల్లు అర్మీ నాగబాబును టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్వీట్లు పెట్టారు. ఇక ఈ వివాదం మరింత ముదరడంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ ను డియాక్టివేట్ చేశారు. నాగబాబు సోషల్ మీడియా అకౌంట్ డి ఆక్టివేట్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఎప్పుడు అందరికి ఆదర్శంగా ఉండే మెగా ఫ్యామిలీలో ఏపీ ఎన్నికలు చిచ్చు రేపాయంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

#nagababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి