AP: హాట్‌ టాపిక్‌గా ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం.. RTVతో కూతురు ఎమోషనల్.!

తండ్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై పెద్ద కుమార్తె హైందవి RTVతో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే తన తండ్రి తమను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. మా తండ్రి మా వద్దకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

AP: హాట్‌ టాపిక్‌గా ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం.. RTVతో కూతురు ఎమోషనల్.!
New Update

Also Read: పెళ్లి పేరుతో మహిళల మోసం.. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి..

RTVతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పెద్ద కుమార్తె హైందవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. వేరే మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే తన తండ్రి తమను దూరం పెట్టారని.. తన తండ్రి చేష్టలకు తాము ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. తన తండ్రిని కనీసం కలవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ప్రేమగా చూసుకునే తన తండ్రి తామెవరో తెలియనట్లుగా బిహేవ్ చేస్తున్నారన్నారు.

తాజాగా, RTVతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. తన కుమార్తలపై ఎందుకు అక్కసు చూపుతున్నారో తెలియడం లేదన్నారు. వేరే మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే తన భర్త తనకు దూరమైయ్యాడన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి తనకు ఈ శాస్తి జరగాల్సిందేనన్నారు. తన పిల్లల భవిష్యత్తు కోసం తాను ఏమైనా చేస్తానన్నారు. దువ్వాడ శ్రీనివాస్..టెక్కలి అయినా విడిచి వెళ్లిపోవాలి.. లేదా ఆమెను వదిలేయలాని కోరారు. ఈ వ్యవహారం మొత్తం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసన్నారు.



ఇదిలా ఉంటే, గత రెండేళ్లుగా వారి కుటుంబంలో విబేధాలు కొనసాగుతున్నాయి. MLC దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య ZPTC దువ్వాడ వాణి వేరువేరుగా ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జిగా తొలగించి.. భార్య వాణికి బాధ్యతలు అప్పగించింది. అయితే, మళ్లీ ఎన్నికల సమయానికి దువ్వాడ శ్రీనివాస్ కే టికెట్ కేటాయించడంతో ఆ సమయంలో దంపతుల మధ్య వార్ తారాస్థాయికి చేరింది.

#mlc-duvvada-srinivas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe