MLA KTR: ట్విట్టర్ 'X’ వేదికగా సీఎస్ శాంతి కుమారికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. అధికారిక వెబ్సైట్లలో డిజిటల్ విధ్వంసం జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో వెబ్సైట్లలో కీలక సమాచారం మాయమవుతోందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా డిజిటల్ విధ్వంసం జరుగుతుందని విమర్శించారు. కేసీఆర్ హయాంలోని వేలాది ఫొటోలు, వీడియోలు తొలగించారని ఫైర్ అయ్యారు.