ఎప్పుడూ సీరియస్ గా కనిపించే మంత్రి కేటీఆర్ (Minister KTR) డ్యాన్స్ తో దుమ్ము లేపారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ (BRS) ప్రచార సభలో మంత్రి పాల్గొన్నారు. కార్యకర్తల కోరిక మేరకు వారితో కలిసి డ్యాన్స్ చేశారు. తమతో కలిసి కేటీఆర్ స్పెప్పులేయడంతో కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రోజు ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. తనకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల అని అన్నారు. ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానన్నారు.
ఇది కూడా చదవండి: Etela Rajender: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే.. ఈటల సంచలన వ్యాఖ్యలు!
ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో రాష్ట్రంలో కర్ఫ్యూ లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ వందల మంది ప్రాణాలు తీసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోసం బతిమిలాడే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చే వారి మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు. 11 సార్లు ఛాన్స్ ఇస్తే ఏం అభివృద్ధి చేశారో ఆలోచన చేయాలని ప్రజలను కోరారు.