Maruti Cars: మారుతి స్విఫ్ట్ కారు కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్..

మారుతి స్విఫ్ట్, గ్రాండ్ విటారా కార్ల ధరలు పెంచుతున్నట్టు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తెలిపింది. జనవరి నెలలోనే తన అన్ని కార్ల ధరలను పెంచిన మారుతి ఇప్పుడు రెండు మోడళ్ల ధరలను ప్రత్యేకంగా ఎందుకు పెంచింది అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 

Maruti Cars: మారుతి స్విఫ్ట్ కారు కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్..
New Update

మారుతి సుజుకి స్విఫ్ట్ -గ్రాండ్ విటారా కారు కొనాలని చూస్తున్న వారికీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL)  బ్యాడ్ న్యూస్ చెప్పింది. స్విఫ్ట్ - గ్రాండ్ విటారా సిగ్మా కు సంబంధించిన కొన్ని  వేరియంట్‌ల ధరలను(Maruti Cars) పెంచినట్లు తెలిపింది. మారుతీ స్విఫ్ట్ ధరలు 25,000 రూపాయలు పెరిగాయి. అదే సమయంలో గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్ ధర రూ.19,000 పెరిగింది. ఈ రెండు మోడళ్ల ధరలను కంపెనీ ఎందుకు పెంచిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అంతకుముందు, మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ జనవరిలో అన్ని కార్ల ధరలను 0.45 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

ధరలు ఎందుకు పెంచారు?

జనవరిలో కార్ల ధరలను(Maruti Cars) పెంచుతున్నట్లుప్రకటించిన సమయంలో ముడిసరుకు ధరలు పెరగడంతో ధర పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ఆ సమయంలో, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను వినియోగదారులపై భారం మోపకుండా కంపెనీ చాలా కాలంగా పని చేస్తోందని, అయితే మార్కెట్ పరిస్థితుల వల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని మారుతీ తెలిపింది.  అయితే, ధరలు(Maruti Cars) పెరగడానికి అనేక కారణాలు ఉండొచ్చని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముడి పదార్థాల ధరలు పెరగడం, ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయం అలాగే మొత్తం ఆర్థిక మందగమనంకారణాలు కావచ్చని వారంటున్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ కొంతకాలంగా ఈ సమస్యలతో పోరాడుతోంది.

Also Read: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమాన సంస్థగా ఇండిగో 

పతనమైన కంపెనీ షేర్లు..

ధరల పెంపు వార్తల తర్వాత మారుతీ సుజుకీ షేర్లు 1.65% పతనంతో రూ.12,675 వద్ద క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ రూ.3.99 లక్షల కోట్లు. కంపెనీ ఒక సంవత్సరంలో తన పెట్టుబడిదారులకు 46.37% రాబడిని ఇచ్చింది. ఇది గత 6 నెలల్లో 22% అలాగే  గత ఒక్క నెలలో 11% రాబడిని ఇచ్చింది.

FY 2023-24లో మారుతి(Maruti Cars) అత్యధిక అమ్మకాలు.. 

అంతకుముందు, మారుతి సుజుకి మార్చిలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో కలిపి మొత్తం విక్రయాల సంఖ్య 187,196 యూనిట్లను సాధించినట్లు తెలిపింది.

మార్చి 2023తో పోలిస్తే, దేశీయ విక్రయాలు 14% వృద్ధితో 156,330 యూనిట్లకు చేరుకున్నాయి. అంతేకాకుండా, కంపెనీ 4,974 యూనిట్ల(Maruti Cars)ను ఇతర అసలైన పరికరాల తయారీదారులకు (OEMలు) విక్రయించింది.  25,892 యూనిట్లను ఎగుమతి చేసింది.

మారుతీ సుజుకి ఆర్థిక సంవత్సరం (FY) 2023-24లో అత్యధిక మొత్తం అమ్మకాలను సాధించింది. ఇది 2,135,323 యూనిట్లకు చేరుకుంది. ఇందులో దేశీయంగా 1,793,644 యూనిట్లు- మొత్తం ఎగుమతులు 283,067 యూనిట్లు ఉన్నాయి.

#automobile #maruti-suzuki
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe