TDP: ఉండి టీడీపీలో అసమ్మతి.. కంటతడి పెట్టిన ఎమ్మెల్యే

ఉండి టీడీపీలో అసమ్మతి చెలరేగిపోతుంది. నరసాపురం ఎంపీ రఘురామ రాజుకు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో ఎమ్మెల్యే రామరాజు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కార్యకర్తలతో సమావేశమై టికెట్ వేరేవారికి ఇవ్వబోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
TDP: ఉండి టీడీపీలో అసమ్మతి.. కంటతడి పెట్టిన ఎమ్మెల్యే

MLA Ramaraju: పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా ఉండి టీడీపీలో అనుకున్నట్లే జరిగింది. ఉండి సీటు రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) కు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే రామరాజు ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తలతో సమావేశమై టికెట్ వేరేవారికి ఇవ్వబోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారు… గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు

భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కుటుంబసభ్యులు, కార్యకర్తల సూచన మేరకు నడుచుకుంటానన్నారు. రాజకీయాలు విరమించుకోవడంపైనా ఆలోచిస్తానని తెలిపారు. ఇలా ఉండి టీడీపీలో అసమ్మతి మరింత చెలరేగిపోతుంది. దీంతో కార్యకర్తలు అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టికెట్ ఎమ్మెల్యే రామరాజుకే ఇవ్వాలని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు