Sravan: శ్రవణ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. 2 గంటల పాటు సినిమా స్టైల్లో హైడ్రామా..! మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. శ్రవణ్ సహా నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. బహదూర్పురాలోని ఓ పోలింగ్బూత్లో రిగ్గింగ్కు పాల్పడుతున్నారంటూ వీడియోను వైరల్ చేసిన కేసులో శ్రవణ్కుమార్ అరెస్ట్ అయ్యారు. By Jyoshna Sappogula 17 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Sravan Kidnap Update: మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. 2 గంటల పాటు సినిమా స్టైల్లో హైడ్రామా నడిచింది. రాత్రి 8 గంటలకు శ్రవణ్ సహా నలుగురిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు పోలీసులు. బహదూర్పురాలోని ఓ పోలింగ్బూత్లో రిగ్గింగ్కు పాల్పడుతున్నారంటూ వీడియోను వైరల్ చేసిన కేసులో శ్రవణ్కుమార్ అరెస్ట్ అయ్యారు. Also Read: ఎన్టీఆర్ ను మోసం చేసిన మహిళ.. హైకోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో..! అయితే, అది 2022లో బెంగాల్ బహదూర్పుర అనే ప్రాంతంలో రిగ్గింగ్కు సంబంధించిన వీడియోగా ఈసీ తేల్చింది. దీంతో నిన్న సాయంత్రం తన ఆఫీస్లో ఉన్న శ్రవణ్ను మఫ్టీలో ఉన్న పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. మిగిలినవారిని కూడా వేర్వేరు చోట్ల అదుపులోకి తీసుకున్నారు. అయితే, కార్పొరేటర్ శ్రవణ్తో పాటు వారంతా కిడ్నాప్ అయినట్టు ప్రచారం జరిగింది. Also Read: పోలింగ్ తర్వాత తొలిసారిగా స్పందించిన పవన్ కళ్యాణ్..! శ్రవణ్ కిడ్నాప్పై ఆయన కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రవణ్కుమార్ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని ఆయన తండ్రి మల్కాజ్గిరి పీఎస్లో ఫిర్యాదు చేశారు. శ్రవణ్ ఆఫీస్కు సమీపంలోని సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే.. వారు మఫ్టీలో వచ్చిన పోలీసులుగా గుర్తించారు. రాత్రి 8గంటలకు శ్రవణ్తో సహా నలుగురిని తామే అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు #malkajgiri-bjp-corporater-sravan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి