నాకు బెయిలివ్వండి.. ఏపీ హైకోర్టుకు పిన్నెల్లి!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎంలను ధ్వంసం చేశారంటూ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నాకు బెయిలివ్వండి.. ఏపీ హైకోర్టుకు పిన్నెల్లి!
New Update

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. ఈవీఎంలను ధ్వంసం చేశారంటూ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని ఈ రోజు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. అయితే.. ఆ వార్తలకు చెక్ పెడుతూ ఆయన తరఫు లాయర్లు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన లొంగిపోయే అవకాశం లేదని తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. ఏపీ పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. ఆయన పిటిషన్ పై కోర్టు మరికొద్ది సేపట్లో విచారణ జరిపే అవకాశం ఉంది.

#pinnelli-ramakrishna-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe