Macherla EVM Issue : బూత్ లో ఏం జరిగిందంటే.. టీడీపీ ఏజెంట్ శేషగిరి సంచలన విషయాలు!

మాచర్లలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొడుతుండగా అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ శేషగిరి ఆర్టీవీతో మాట్లాడారు. ఈవీఎం పగలగొట్టకముందు ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లోకి రెండు సార్లు వచ్చి వెళ్లాడన్నారు. బయటకు వెళ్లిన తర్వాత ఎమ్మెల్యే అనుచరులు తనపై తీవ్రంగా దాడి చేసినట్లు చెప్పారు.

New Update
Macherla EVM Issue : బూత్ లో ఏం జరిగిందంటే.. టీడీపీ ఏజెంట్ శేషగిరి సంచలన విషయాలు!

Palvai Gate Polling Booth : పాలువాయి గేటు పోలింగ్ బూత్ లో మాచర్ల (Macherla) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం (EVM) లను పగలగొట్టిన సంఘటన సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఎమ్మెల్యే ఈవీఎంను పగలగొడుతుండగా అడ్డుకున్నారు టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు. అధికారులు విడుదల చేసిన వీడియోలో ఇది కూడా రికార్డ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆర్టీవీతో శేషగిరిరావు మాట్లాడారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండు సార్లు పోలింగ్ బూత్ కు వచ్చి వెళ్లాడన్నారు. మూడోసారి వచ్చి ఈవీఎం పగలగొట్టినట్లు శేషగిరిరావు చెప్పారు.

ఎమ్మెల్యేతో పాటు బయట వ్యక్తులు నలుగురు వచ్చారన్నారు. ఇదేంటని అడిగితే నీ అంతు చూస్తానని బెదిరించినట్లు వివరించారు. పోలింగ్ బూత్ నుండి బయటకు వచ్చాక ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో తన తలకు గాయమైందని చెప్పారు. తనను కొడుతుండగా స్థానికులు రావడంతో బయపడ్డానన్నారు. నాలుగుసార్లు పోలింగ్ ఏజెంటుగా ఉన్నా... ఎప్పుడూ ఇలాంటి ఘటన చూడలేదన్నారు. శేషగిరి (Sheshagiri) పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

Also Read : కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..బోల్తాపడ్డ ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు!

Advertisment
తాజా కథనాలు