Jaya prakash Narayan: వాళ్లదే అధికారం.. జయప్రకాశ్ నారాయణ్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ రాజధానిపై వైసీపీకి అసలు క్లారిటీనే లేదని విమర్శించారు లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్. ఏపీలో తుగ్లక్ పాలన నడుస్తుందని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వంతో పాటు తెలుగు రాజకీయ పరిణామాలపై జేపీ ఏం అన్నారో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 17 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Dr. Jayaprakash Narayan: దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా మౌళికమైన రాజకీయా మార్పుకు మన పార్టీలు సిద్ధంగా లేవని విమర్శించారు మాజీ IAS, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్. ప్రజాస్వామ్యాన్ని కేవలం ఓటుకు పరిమితం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. ప్రజల్లో, యువతల్లో చైతన్యం నింపాలన్నారు. కుల మతాలను రాజకీయాల్లో వాడడం చాలా దుర్మార్గమని కామెంట్స్ చేశారు. Also Read: 100 రోజుల్లో వంద తప్పులు.. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ విమర్శలు తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు పంపిణి లేకుండా ఓటు అనేది లేదని చురకలంటించారు. ప్రజాస్వామ్యంలో బలం, బలహీనత రెండూ ఉంటాయని చెప్పుకొచ్చారు. సంక్షేమం అంటూ పిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో తుగ్లక్ పాలన ఉన్నట్లు ఉందన్నారు. ఏపీ, తెలంగాణ రాజకీయాలపై జేపీ ఏం అన్నారో తెలుసుకునేందుకు, ఆయన విశ్లేషణ కోసం కింద వీడియోను చూడండి. #dr-jayaprakash-narayan #lok-satta-party-president మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి