Liquor Shops : బ్యాడ్‌ న్యూస్‌..రెండు రోజుల పాటు వైన్‌ షాపులు..!

వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసేయాలని పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలన్నారు.

author-image
By Bhavana
New Update
wineshop

Hyderabad : హైదరాబాద్‌ లోని మందుబాబులకు పోలీస్‌ అధికారులు ఓ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పారు. నగరంలో రెండు రోజుల పాటు వైన్స్‌, బార్లు మూసేయాలని నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతుండగా.. ఇప్పటికే నగరంలో వినాయక నిమజ్జనాలు మొదలు అయ్యాయి. వినాయకున్ని ప్రతిష్ఠించిన తర్వాత మూడో రోజు నుంచే.. నిమజ్జనాలను నగర వాసులు స్టార్ట్‌ చేస్తారు.

Also Read :  నన్ను హత్య చేయడానికే మా ఇంటికి వచ్చాడు–కౌశిక్ రెడ్డి

తొమ్మిదో రోజునే నిమజ్జనం..

ఈ క్రమంలో.. ఇప్పటికే నగరంలోని హుస్సేన్ సాగర్‌తో పాటు పలు చెరువులు, కుంటల వద్ద గణేష్ నిమజ్జనాల సందడి మొదలైంది.. అయితే.. ప్రధానంగా నగరంలోని బడా గణేషుడైన ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం సెప్టెంబర్ 17న నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 17వ మంగళవారం నాటికి తేదీకి తొమ్మిది రోజులు అవుతుండటంతో.. దాదాపుగా అన్ని వినాయకులను అదే రోజున హుస్సేన్‌ సాగర్‌ లో నిమజ్జనం చేయనున్నారు. కొన్ని గణేషులను పదకొండు రోజుల వరకు ఉంచినప్పటికీ చాలా వరకు వినాయకులను తొమ్మిదో రోజునే నిమజ్జనం చేస్తుంటారు.

దీంతో.. ఆ రోజున నగరమంతా పండగ వాతావరణం నెలకుంటుంది. ఈ క్రమంలో.. నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లను చేసిన సంగతి తెలిసిందే. శోభాయాత్రలు జరిగే మార్గాల్లో.. నిమజ్జనాలు చేసే ప్రదేశాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read :  హైడ్రాకు షాక్.. ఢిల్లీలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు!

ప్రభుత్వ ఆదేశాల మేరకు.. కొత్తగా వచ్చిన హైదరాబాద్ (Hyderabad) సీపీ సీవీ ఆనంద్.. రంగంలోకి దిగి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో.. నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసేయాలని పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.

నిమజ్జనం రోజయిన సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కళ్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, మూసేయాలని సీపీ సీవీ ఆనంద్ ముందుగానే తెలిపారు.ఈ నిబంధనలను వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు తప్పకుండా పాటించాలని.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరికలు జారీ చేశారు.

Also Read :  రాత్రి పూట కూడా ఎంఎంటీఎస్‌ సేవలు!
Advertisment
తాజా కథనాలు