Kodali Nani: ఈ విషయంపై హైకోర్టుకు వెళ్తాం.. మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.!

టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసిందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళ్తామని..ప్రైవేట్ కేసులు వేస్తామని అన్నారు.

Kodali Nani: ఈ విషయంపై హైకోర్టుకు వెళ్తాం.. మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.!
New Update

Kodali Nani: టీడీపీ, జనసేన శ్రేణులు తమపై దాడులకు పాల్పడుతున్నారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ వారిని భయపెట్టాలనుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని.. వైసీపీ వారిపై దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ నిలబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు.

Also Read: ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు.. ఎమ్మెల్యే బాలరాజు షాకింగ్ కామెంట్స్.!

వైసీపీ శ్రేణుల దాడులపై హైకోర్టుకు వెళ్తామని.. ప్రైవేట్ కేసులు వేస్తామని అన్నారు. దాడులు చేసిన వారితో పాటు..చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తామన్నారు. రాబోయే రెండు రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తామని.. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతామని అన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. శాంతిభద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

#kodali-nani
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe