తెలంగాణ ప్రభుత్వం పదేళ్లుగా ఒక్క రేషన్‌ కార్డూ ఇవ్వలేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

New Update
తెలంగాణ ప్రభుత్వం పదేళ్లుగా ఒక్క రేషన్‌ కార్డూ ఇవ్వలేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

Telangana Elections 2023: తెలంగాణలో పదేళ్లుగా సాగుతున్న కుటుంబ పాలనకు ఈ ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలుకుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి సారంగపాణికి మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన ఆయన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం వేల ఎకరాల భూములను సంపాదించుకుని ఫామ్ హౌస్‌లు నిర్మించుకుందని; పేదల ఇళ్ల నిర్మాణాన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

గెలిచిన పదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పేదలను ఇబ్బందుల పాలు చేసిందన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ దొంగ హామీలకు మరోసారి మోసపోవద్దన్నారు. అభూత కల్పనలే తప్ప హామీలు మరిచిన బీఆర్ఎస్ ను గద్దె దింపి సుపరిపాలనను అందించే బీజేపీ ప్రభుత్వానికి అవకాశమివ్వాలని ప్రజలను కోరారు.

Advertisment
తాజా కథనాలు